తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోలు, హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో కొద్ది మంది మాత్రమే లక్కీగా ఇతర చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఆ మద్య అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మంచి విజయం అందుకోవడమే కాదు పెట్టిన పెట్టుబికి పదింతలు వచ్చింది.
ఈ చిత్రంతో హీరోయిన్ గా నటించిన పాయల్ కి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఛాన్సులు దక్కించుకున్న పాయల్ తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేస్తున్నాడు.
నవంబర్ 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ వీఐ ఆనంద్ తో కలిసి చేయనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు అవసరమట. 'నన్ను దోచుకుందువటే' అందరి మను దోచుకున్న నాభా నటేశ్, మరో కథానాయికగా కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.