తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లో వచ్చే చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి.  ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది.  ఇప్పుడు మ‌రోసారి కాంబినేష‌న్ రిపీట్ కాబోతుంది.  కాకపోతే..ఈ సారి తెలుగు సినిమా కాకుండా మ‌ళ‌యాళ మూవీ కోస‌మే జ‌న‌తా గ్యారేజ్ కాంబినేష‌న్ రిపీట‌వుతోంది.  అంతే కాదు ఈ చిత్రానికి ఎన్టీఆర్ మాత్రమే కాదు రజినీకాంత్ కూడా హెల్ప్ చేస్తున్నాడట.  తెలుగు తెరపై 2016లో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది.   
Image result for janatha garage
డెడ్లీ కాంబినేష‌న్‌ను సెట్ చేసి బాక్సాఫీసు వ‌ద్ద వంద కోట్ల‌ను కొల్ల‌గొట్టాడు ద‌ర్శ‌కుడు శివ‌. మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌రో మాలీవుడ్ మూవీ మ‌న్యం పులి తెలుగులో మంచి వ‌సూళ్ల‌నే అందుకుంది. మ‌రోసారి కెరియ‌ర్‌లో భారీ చిత్రాన్ని చేస్తున్నాడు.  మోహన్ లాల్ హీరోగా ‘ఒడియా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  మ‌ళ‌యాళీ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో నిర్మాణం జ‌రుపుకుంది.
Related image
సుమారు వంద కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.  గ‌తంలో పులి ముర‌గ‌న్ చిత్రాన్ని త‌మిళ్, తెలుగు భాష‌ల్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఒడియా చిత్రం కూడా మళియాళ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఒడియ‌న్ త‌మిళ్ వ‌ర్ష‌న్‌కు ర‌జ‌నీకాంత్‌, తెలుగు వ‌ర్ష‌న్‌లో తార‌క్‌తో వాయిస్ ఓవ‌ర్ ఇప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: