తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ముఖ్య పాత్రలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.  ‘యాత్ర’ షూటింగ్ నేటితో పూర్తైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కింది.
Image result for YATRA MOVIE
ఈ సందర్భంగా మహి.. మమ్ముట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మమ్ముట్టితో ‘యాత్ర’ ముగిసింది. 390 సినిమాలు.. 3 నేషనల్ అవార్డులు.. అలాగే 60 మందికి పైగా నూతన దర్శకులతో పని చేసిన అనుభవం. దీనికంటే కూడా మమ్ముట్టి ఒక అద్భుతమైన వ్యక్తి, గ్రేట్ మెంటర్.ఇంక ఆయన నిరూపించుకోవల్సిందేమీ లేదు.  ఆయన మన భాషను, సంప్రదాయాన్ని, సినిమాలను చాలా ప్రేమిస్తారు. నాకు ఇంతకంటే ఏమీ అవసరం లేదు.

నా గుండెపై చెయ్యి వేసుకుని చెప్తున్నా.. ఆయన ఈ పాత్రలో జీవించినట్టుగా మరే నటుడు   పలికారు. డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పారు. మమ్ముట్టి తెలుగులోను తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వుంటారు. అలాగే ఆయన ఈ సినిమాలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేష్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: