‘ఫిదా’ మూవీ సూపర్ సక్సస్స్ తరువాత సాయి పల్లవికి ఏర్పడ్డ క్రేజ్ తో ఆమె హీరోయిన్స్ విషయంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది అని అందరు భావించారు. అయితే సాయి పల్లవికి ఉన్న ఇగో గురించి అనేక వార్తలు రావడంతో ప్రస్తుతం చాలామంది ఆమెతో నటించడానికి ఇష్టపడటం లేదు. అయితే ఈవిషయాలను లెక్క చేయకుండా రానా దగ్గుబాటి సాయి పల్లవికి అవకాసం ఇవ్వడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ప్రస్తుతం రానా తన ఆరోగ్యం పై ఎన్నో గాసిప్పులు వచ్చినా ఆవిషయాలు పట్టిచుకోకుండా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు క్యారెక్టర్లు ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. అదే ట్రెండ్ కొనసాగిస్తూ రానా లేటెస్ట్ గా ‘విరాటపర్వం 1992' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది.
ఈసినిమాకు దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ‘నీది నాది ఒకే కథ' అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు తన మొదటి సినిమాతో చాలామంది దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆసినిమా హిట్ కాలేదు కానీ దర్శకుడుగా అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. 1992 బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పీరియడ్ ఫిలిం స్టొరీగా ‘విరాటపర్వం 1992’ ఉంటుందని సమాచారం.
అయితే ఈకథలో హీరోయిన్ పాత్రకు చాల ప్రాముఖ్యత ఉన్న నేపధ్యంలో సాయి పల్లవి ఆపాత్రకు అన్ని విధాల సరిపోతుంది అని ఈమూవీ దర్శకుడు ఇచ్చిన సలహాకు వెంటనే రానా ఓకె చెప్పినట్లు టాక్. ఇగోల విషయంలో సాయి పల్లవితో సరిసమానంగా రానా పై కూడ గతంలో అనేక వార్తలు వచ్చాయి. దీనితో వీరిద్దరూ తమ ఇగోలను పక్కకు పెట్టి ‘విరాటపర్వం 1992’ కోసం ఎంత వరకు ఒకరికొకరు రాజీ పడతారో చూడాలి..