మీ టూ ఉద్యయం ఇప్పడూ ఇండియా లో అగ్ని లా కాలుతుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాలు, తెర వెనుక దాగిఉన్న నీచులు బండారం ఒక్కొక్కరిది బయటికి వస్తుంది. బాలీవుడ్లో దర్శక, నిర్మాతల తీరుతో తాను విసిగిపోయానని అహానా కుమ్రా సంచలన విషయాలు బయటపెట్టింది. మీ టూ ఉద్యమం బలంగా కొనసాగుతుండటంతో అహానా కుమ్రా తాను పడిన బాధలను ఏకరువు పెట్టింది. ఇంతకీ అహానా చెప్పిన విషయాలు ఏమిటంటే..
బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితులు నా జీవితాన్ని కుంగదీశాయి. ఓ దశలో అత్మహత్య చేసుకొందామా అనే ప్రయత్నం చేశాను. కానీ అలాంటి ఆలోచనను మానుకోవడంతో ప్రస్తుతం మరో ప్రపంచంలో బతుకుతున్నాను. ఐదేళ్ల క్రితం దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయాను. దానిని నుంచి బయటకు లాగే వారే కనిపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్లో నాకు ఎదురైన కష్టాల కారణంగా ఆత్మహత్యే శరణ్యమనిపించింది. నా తల్లిదండ్రుల ప్రతిష్ట, పరువు, వారి అంచనాలకు దూరంగా ఉన్నాను. సూసైడ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాను. కానీ చివరి నిమిషంలో చావు పరిష్కారం కాదని నిర్ణయించుకొన్నాను.
నా తల్లిదండ్రుల కోసం జీవించాలనుకొన్నాను అని అహానా పేర్కొన్నది. ఓ ప్రొఫెషనల్గా బాలీవుడ్లో అడుగుపెడితే ఏదో ఓ గ్రూప్తో కలిసిపోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా వారితో కలిసి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. పరిస్థితులకనుగుణంగా నీవు నీ అస్థిత్వాన్ని కోల్పోతావు. నీవు కాకుండా మరో మనిషి నీలో కనిపిస్తాడు. నా దురదృష్టం కొద్ది నేను దారుణమైన గ్రూప్లో పడిపోయాను అని అహానా వెల్లడించారు. ఓసారి ఓ వ్యక్తి చెప్పలేని చోట తాకితే షాక్ తిన్నాను. అలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందు నాకు ఎదురుకాలేదు. నా జీవితంలో నేను పాటించాలనుకొన్న కొన్ని నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. నా ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయానో అర్థం చేసుకొనే సరికి నేను నాలా కనిపించలేదు అని అహానా కన్నీటిపర్యంతమైంది.