ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ మాస్ డైరెక్టర్ గా ఎంతో పేరులో కొనసాగిన మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ప్రస్తుతం ఎంతో దయనీయంగా మారిపోయింది. ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన రవితేజ ప్రస్తుతం వరస ఫ్లాప్ ల మధ్య సతమతమైపోతున్నాడు. దీనికితోడు రవితేజ ఫేస్ లో గ్లో కూడ తగ్గడం అతడి ఇమేజ్ కి మరింత నష్టాన్ని కలిగిస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం రవితేజ ఫెయిల్యూర్ దర్శకుడు శ్రీనువైట్లని అదేవిధంగా ఒకనాటి గ్లామర్ హీరోయిన్ ఇలియానాని నమ్ముకుని చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ పూర్తి అయి చాలాకాలం అయినా ఈమూవీ విడుదలకు సరైన బయ్యర్లు దొరకక ఈమూవీ నిర్మాతలు మైత్రీ మూవీస్ తెగ కస్టాలు పడుతున్నట్లు టాక్. ఇప్పటి వరకు ఈసినిమాకు సంబంధించిన సరైన విడుదల డేట్ గురించి బాధపడ్డ రవితేజ ఇప్పుడు తన సినిమాకు బయ్యర్లు దొరకకపోవడం మరింత సమస్యగా మారింది అని అంటున్నారు.

ఒకప్పుడు సూపర్ స్టార్ హీరోలకి సరి సమానమైన క్రేజ్‌ ఎంజాయ్‌ చేసిన శ్రీనువైట్లకి 'ఆగడు', 'బ్రూస్‌లీ', 'మిస్టర్‌' లాంటి మర్చిపోలేని డిజాస్టర్స్‌ నేపధ్యంలో అతడి సినిమాలు అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ప్రస్తుతం ఓవర్సీస్ ప్రేక్షకులలో రవితేజ సినిమాలకు పూర్తిగా క్రేజ్ పోవడం మరింత సమస్యగా మారింది. 
మైత్రి మూవీ మేకర్స్‌ కు నిర్మాతలుగా మంచి పేరు ఉన్నా రవితేజ శ్రీనువైట్లల ట్రాక్ రికార్డ్ ను చూసి ఈసినిమాను కొనడానికి చాలామంది భయపడిపోతున్నారని టాక్.

అయితే అనూహ్యంగా ఈనెల 16న విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ తో పోటీ పడుతూ ఈమూవీ విడుదల కాబోతోంది. అయితే రెండు ఇమేజ్ లేని సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ రవితేజాల మధ్య జరగబోయే వార్ లో ఎవరు విజేత అవుతారు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో నెలకొని ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: