ఈ మద్య స్టార్ హీరోల తనయులే కాదు కూతుళ్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే హీరోల కూతుళ్లు హీరోయిన్లు గా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ లు హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుతం అన్ని రకాల పాత్రలతో మెప్పిస్తుంది. ఈ మద్య విశాల్, కీర్తి సురేష్ నటించిన ‘పందెంకోడి 2’సినిమాలో పవర్ ఫుల్ నెగిటీవ్ పాత్రలో కనిపించింది. స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ సినిమాలో కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతుందట వరలక్ష్మీ శరత్ కుమార్.
'సర్కార్' ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించింది. సర్కార్ సినిమాలో నేను చేసిన పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ తో సాగే పాత్ర..చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వడమే నాకు అలవాటు.
నేను హీరోయిన్ గా మాత్రమే చేయాలి అని ఎప్పుడూ గిరి గీసుకున్నది లేదు. నేను చేసే పాత్ర కొత్తగా ఉండాలి .. తెరపై నేను కాకుండా పాత్ర మాత్రమే కనిపించాలని అనుకుంటాను. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలో ఒక మంచి రోల్ చేయాలనేది నా ఆశ. లేదంటే యుద్ధం నేపథ్యంలో సాగే కథలో అవకాశం లభించినా అదృష్టంగానే భావిస్తాను.
ప్రతి సినిమాలోనూ నేను కాకుండా పాత్ర మాత్రమే కనిపించాలని అనుకుంటాను. అందువల్లనే ఒక్క తమిళంలోనే నేను చాలా విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాను. సుదీర్ఘ కాలంపాటు హీరోయిన్ గా ఉంటూ .. ఒకే తరహా పాత్రలను చేయడమనేది నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు అది నాకు సంతృప్తిని కూడా ఇవ్వదు అని చెప్పుకొచ్చింది. నా అభిమాన హీరో ఎవరంటే మాత్రం ప్రభాస్ పేరు చెబుతాను . 'బాహుబలి' చూసిన దగ్గర నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను అని చెప్పుకొచ్చింది.