ప్రేమమ్ సినిమాతో సౌత్ అంతటా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తమిళమ్మాయి సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత వచ్చిన ఎం.సి.ఏ సినిమా కూడా హిట్ కొట్టడంతో సాయి పల్లవికి తిరుగు లేకుండా పోయింది. అయితే అమ్మడు వరుస సినిమాలైతే హిట్లు కొడుతుంది కాని చేస్తున్న సినిమాల హీరోలతో మాత్రం గొడవలు పడుతుందట.


నాని ఎం.సి.ఏ టైంలో సాయి పల్లవి కాస్త ఓవర్ చేసిందని అన్నారు. ఇక ఆ తర్వాత నాగ శౌర్యతో చేసిన కణం టైంలో కూడా అమ్మడి మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. లేటెస్ట్ గా శర్వానంద్ తో చేస్తున్న పడి పడి లేచే మనసు టైంలో కూడా సాయి పల్లవి ప్రవర్తన పట్ల కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇదిలాఉంటే నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల విరాటపర్వం 1992 సినిమా ఒకటి ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో శర్వానంద్ ను హీరోగా మాట్లాడగా అతనికి పెయిర్ గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే ఆమె హీరోయిన్ గా అయితే తాను ఈ సినిమా చేయనని చెప్పాడట శర్వానంద్.


శర్వాతో సాయి పల్లవి గొడవలేమి బయటకి రాకున్నా అతను ఎందుకు ఆమె పక్కన చేయనన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక శర్వానంద్ ప్లేస్ లో ఆ ప్రాజెక్ట్ లోకి రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తుంది. మరి శర్వానంద్ తో సాయి పల్లవి గొడవ ఏంటో బయటకు మాత్రం రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: