తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమాపై రోజు రోజుకీ భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఆ మద్య రిలీజ్ అయిన టీజర్  2.0 పై అంచనాలు పెంచితే..తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బీభత్సం సృష్టిస్తుంది.  ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రజినీకాంత్ ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు.  2.0 సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా ఎన్నో కారణాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది.  ఈ మద్య సినిమా రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు మొదలు పెట్టడంతో 2.0 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న '2.ఓ' సినిమా ట్రయిలర్ వచ్చేసింది.
Image result for rajinikanth
చెన్నైలోని సత్యం థియేటర్ లో ట్రైలర్ విడుదల వేడుక వైభవంగా జరిగింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ..సినిమాను ప్రారంభించిన సమయంలో అనారోగ్యానికి గురయ్యానని, 12 కిలోల బరువైన బాడీకోట్ వేసుకుని నటించలేనని అనిపించి, అదే విషయాన్ని దర్శకుడు శంకర్ కు చెప్పానని అన్నారు. కొన్ని సీన్లకు 8 నుంచి 10 టేకులు తీసుకున్నానని గుర్తు చేసుకున్న రజనీ..అంతే కాదు ఈ సినిమా నేను చేయలేనని డిసైడ్ చేసుకున్నానని అన్నారు.  సినిమా నుంచి తప్పుకుంటా. నన్ను వదిలేయండి. న్యాయం చేయలేకపోతున్నా" అని శంకర్ కు చెప్పానని అన్నారు. 
Image result for rajinikanth
కానీ శంకర్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు..ఈ సినిమా నేనే ఖచ్చితంగా చేయాలని అన్నారు. ఆ బాడీ కోట్ ను తీసేస్తానని, స్పాట్ కు వచ్చి నిలబడితే చాలునని అన్నాడని రజనీ చెప్పారు. తాను మాత్రం నటిస్తే, బాడీసూట్ తోనే నటిస్తానని చెప్పానని తెలిపారు. ఢిల్లీ షెడ్యూల్ తరువాత నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే, అదే విషయాన్ని నిర్మాత సుభాస్కరన్ కు చెప్పానని, ఆయన నాలుగు సంవత్సరాలైనా సరే వేచి చూస్తామని చెప్పారని అన్నారు.  ఈ సందర్భంగా భారతీయ సినీ ఇండస్ట్రీలో కొంత మంది అద్భుతమైన దర్శకులు ఉన్నారని..వారిలో శంకర్, రాజ్ కుమార్ హిరాణి, రాజమౌళి వంటి దర్శక ఆణిముత్యాలను మనం కాపాడుకోవాల్సి వుందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: