నాగచైతన్య 'సవ్యసాచి' బాక్సాఫీసు వద్ద  ఫెయిల్ అవడంతో నాగచైతన్య కెరియర్ లో ఇది వరస మూడవ ఫ్లాప్ గా మారింది. చైతు గతచిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' సాధించిన వసూళ్లతో పోలిస్తే ఓపెనింగ్స్  ఈమూవీకి చాలతక్కువగా  ఉండటం హాట్ టాపిక్  గా మారింది. ‘సవ్యసాచి' చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినా ప్రమోషన్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నా ఇలాంటి ఫెయిల్యూర్ టాక్ ఈమూవీకి రావడంతో ఈఫలితం చైతన్య కెరియర్ పై ఉంటుంది అని అంటున్నారు.
ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..?
వాస్తవానికి ఈసినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించవలసి ఉంది అని అంటున్నారు. ‘ఫిదా’ సూపర్ సక్సస్ తరువాత వరుణ్ తేజ్ కు చందు మొండేటి ‘సవ్యసాచి’ కథ చెప్పడం ఇంచుమించు వరుణ్ తేజ్ అంగీకారం తీసుకోవడం అప్పట్లో జరిగి పోయింది. 
చాలా మంది అంటున్న మాట ఇదే...
అయితే మరింత ఆలోచించిన వరుణ్ తేజ్ తాను ‘సవ్యసాచి’ సినిమాకు హీరోగా పనికిరాను అని ఆలోచించి ఆతరువాత వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ కు ఓటు వేశాడని తెలుస్తోంది. దీనితో చందు మొండేటి తిరిగి చైతన్య వైపు యూటర్న్ తీసుకుని ‘సవ్యసాచి’ నిర్మించడం జరిగింది అని అంటున్నారు. 
డిస్ట్రిబ్యూటర్ గణాంకాలు
వాస్తవానికి ఈసినిమాలో చెప్పిన హీరో ఎడమ చేయి సిండ్రోమ్ పాయింట్ కొత్తదే అయినా ఆపాయింట్ ను కథగా మార్చడంలో చందు మొండేటి ఘోరంగా విఫలం అవ్వడంతో చైతన్య ఈమూవీలో బాగా నటించినా ఫలితం లేకుండా పోయింది. నిన్నటి రోజున ఈమూవీ కలక్షన్స్ హాలిడే అయినప్పటికీ ఘోరంగా డ్రాప్ కావడం ఈమూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లను నిరాశ పరుస్తోంది. దీనికితోడు ఈ దీపావళికి భారీ సినిమాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈమూవీ కోలుకోలేని ఫ్లాప్ గా మారడం ఖాయం అని అంటున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: