తమిళ టీవి, సిని ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.  తమిళనాడులోని దిండుగల్‌ జిల్లా పళనికి చెందిన సినీ నటుడు విజయరాజ్‌(43) గుండెపోటుతో మరణించారు.  విజయరాజ్‌ ఇప్పటి వరకు పలు టివి సీరియల్స్ లో నటించారు.  ఆయన నటించిన ‘కోలంగల్‌’, ‘వెట్టివొలి’,‘నాదస్వరం’ మంచి ఆదరణ లభించింది.  అంతే కాదు ఆ మద్య ‘ఎండన్‌ మగన్‌’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. 

దీపావళి పండుగ జరుపుకోవడానికి ఆయన రెండు రోజుల క్రితం తన సొంత ఊరుకి వెళ్లినట్లు సమాచారం. అక్కడే ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

వెంటనే కుటుంబ సభ్యులు   పళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. విజయరాజ్‌ మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: