తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  మహానటులు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది.  ఆయన నటనా జీవితానికి సంబంధించి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రాజకీయ జీవితానికి సంబంధించి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ గా రెండు భాగాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కో లుక్ రిలీజ్ చేస్తూ ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

తాజాగా ఈ మూవీ యూనిట్ ..సావిత్రి పాత్రలో యాక్ట్ చేస్తోన్న నిత్యా మీనన్ లుక్‌ను రిలీజ్ చేశారు.   ఇప్పటి వరకు సీఎం చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావు గా సుమంత్, నందమూరి హరికృష్ణగా కళ్యాన్ రామ్, శ్రీదేవి గా రకూల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా..తాజాగా అలనాటి మహానటి సావిత్రి పాత్రలో నిత్య మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  అయితే సిని ఇండస్ట్రీలో ఎన్టీఆర్, సావిత్రి కాంబినేష్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. 

ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ ఎప్పటికీ మరువలేని చిత్రంగా నిలిచిపోయింది.  ఇందులో ‘గుండమ్మ కథ’లో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ నిత్యా మీనన్,బాలయ్య లుక్‌ను రిలీజ్ చేశారు.
Image result for ntr biopic
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పాత ‘గుండమ్మ కథ’ పోస్టరే గుర్తుకు వస్తోంది. ఇపుడు తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ ...కథానాయకుడు’ మూవీలో ‘మాయా బజార్’, ‘మిస్సమ్మ’, ‘గుండమ్మకథ’ వంటి సినిమాల్లో సీన్స్‌ను పిక్చరైజ్ చేసారు.  ఈ మూవీలో సావిత్రి పాత్రకు సంబంధించిన పోర్షన్ పూర్తైయింది. అంతేకాదు తనపాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా నిత్యా పూర్తి చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: