తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఒక శాస్త్రవేత్త రోబో తయారు చేసి..దానికి మనిషికి ఉండే ఫీలింగ్స్ కూడా కనెక్ట్ చేయడంతో ఆ రోబో కాస్త ఆ శాస్త్రవేత్తకే ఎదురు తిరగడం..దాన్ని భద్రతల దృష్ట్యా అంతం చేయడం ‘రోబో’స్టోరి.  ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ కి వరుసగా ఫ్లాప్ లు రావడం మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో రోబో సీక్వెల్ తీయాలనే ఆలోచన రావడం..దాన్ని వెంటనే అమలు చేయడం..‘2.0’ తెరకెక్కించడం జరిగింది.   

Image result for 2.0 movie stills

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ చూసిన వారు డైరెక్టర్ శంకర్ మరోసారి బీభత్సం సృష్టంచడం ఖాయమని అంటున్నారు.  ఇంత వయసు ఉన్నా రజినీకాంత్ మాత్రం ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారని ఖితాబు ఇస్తున్నారు.  తాజాగా "విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ నా అభినందనలు"... ఇటీవల విడుదలైన '2.0' ట్రయిలర్ ను చూసి ఫిదా అయ్యారట టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.  

Related image

సినీ అభిమానులు ఈ చిత్రం గురించి ఏంతగా ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విసువల్ ఎఫెక్ట్స్ ఈ ట్రయిలర్ లో కనిపించడంతో, అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఇక మహేష్ బాబు ట్వీట్‌ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ 'కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: