భారత దేశంలో ఈ మద్య ‘మీ టూ ’ ఉద్యమం భారీ ఎత్తున కొనసాగుతుంది. హాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘మీ టూ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ఉన్న మహిళలు సైతం మీ టూ ఉద్యమం ద్వారా లైంగిక దాడులకు పాల్పపడిన వారిని బజారుకీడ్చారు. ప్రస్తుతం ‘మీ టు ’ఉద్యమం భారత దేశానికి విస్తరించింది. బాలీవుడ్ లో ఆ మద్య తనూశ్రీ దత్తా ‘మీ టూ ’ ఉద్యమం లో భాగంగా పది సంవత్సరాల క్రితం ప్రముఖ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని..లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తర్వాత కొరియో గ్రాఫర్, దర్శకుడిపై కూడా సంచనల ఆరోపణలు చేసింది.
ఆ తర్వాత కంగనా రౌనత్ మరికొంత మంది నటీమణులు సైతం గతంలో తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన వారు ఉన్నారు..మద్దతు ఇచ్చినవారు ఉన్నారు. ఇక దక్షిణాదిన కూడా ‘మీ టూ’ ఉద్యమం కొనసాగుతుంది. గాయని చిన్మయి గతంలో తనపై రచయిత వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ పనిపై ఇంటికి వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని..లైంగికంగా వేధించాడని తమిళ నటుడు, నటి రాధిక సోదరుడు రాధారవి మీద ఓ మహిళ అజ్ఞాతంగా ఆరోపించారు.
తాజాగా ఈ విషయంపై రాధారవి స్పందిస్తూ..ఈ మద్య మీ టూ ఉద్యమం అంటూ కొంత మంది మహిళలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని..రేసిజం గురించి మాట్లాడటానికి అమెరికాలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం మన ఇండియాలో తప్పు దారిలో నడుస్తోంది. కొన్ని రోజులైతే ‘మీటూ’ అనేది బెదిరింపు ఆయుధంలా మారిపోతుందేమో? మీటూ అనేది కేవలం స్త్రీలకే కాదు పురుషులు కూడా కొంత మంది వల్ల ఇబ్బందులు పడుతున్నారు..మరి వారి విషయం ఏంటి అని ప్రశ్నించారు.
ఇలా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎవరు కరెక్టో మనం తెలుసుకోవాలి. మేం అజ్ఞాతంగా ఉంటాం కానీ మగవాళ్ల పేర్లు మాత్రం చెబుతాం అంటున్నారు. ఇదెక్కడి న్యాయం..ఒకవేళ అన్యాయం జరిగితే అప్పుడే నిలదీయాలి..రచ్చచేయాలి..ఉద్యమం నిజమైతే నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ‘మీటూ’ నమ్మేలా లేదు. అందుకే సపోర్ట్ చేయదలచుకోలేదు అన్నారు రాధారవి.