బాలీవుడ్ హీరోయిన్స్ తాము ఏం చేసిన ఫ్యాషన్ అనుకునే భ్రమలో బతుకుతున్నారు. దీనితో చాలా మంది ఆగ్రహానికి గురవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఫోటో వివాదాస్పదం అయింది. ఈ ఫోటోలో ఆమె చేతిలో దీపం పట్టుకుని దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు కనిపించింది. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కిరికిరి... ఈ ఫోటోలో ఆమె కేవలం బ్రా మాత్రమే వేసుకుని దర్శనమివ్వడం నెటిజన్లకు కోపం తెప్పించింది. సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాల్సిన దీపావళి వేడుకలో ఈ టింగరి వేషాలేమిటి అంటూ నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు.

 బ్రా బ్రాండ్ ప్రమోషన్స్ కోసమేనా?

బ్రా వేసుకోవడాన్ని ఎవరూ తప్పుబడట్టం లేదు కానీ... ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఏమిటి? నీకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలో కూడా తెలియదా... అంటూ విమర్శలకు దిగారు. ఈ ఫోటోలో ఆమె కెల్విన్ క్లెయిన్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని కనిపించారు. బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రమోషన్ కోసమే ఆమె ఈ ఫోటో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఆమెకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పోస్టు చేసినందుకు ఆమెకు సదరు కంపెనీ భారీ మొత్తం అందినట్లు సమాచారం.

 కనీసం మన సంస్కృతికి గౌరవించు

నువ్వు ఏ దుస్తులు వేసుకోవాలో నీ ఇష్టం. కానీ నువ్వు వేసుకునే దుస్తులతో మన సంస్కృతిని కించ పరిచే విధంగా ప్రవర్తించవద్దు. కనీసం మన ట్రెడిషన్‌కు గౌరవం ఇవ్వు. దీపావళి సెలబ్రేషన్స్ అంటూ ఇలాంటి చర్యలకు పాల్పడం సరికాదు అని కొందరు ఆమెకు సూచించారు. దిశా పటానీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె అలి అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె రాధా సర్కస్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరో. 2019 ఈద్‌కు ఈ మూవీ విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: