ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి విషయం ఇట్టే వైరల్ అవుతుంది. ఇదిగో పులి అంటే..అదుగో తోక అంటున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇది కాస్త ఎక్కువే అవుతుంది. జరిగేది ఒకటి అయితే..సోషల్ మీడియాలో మరొకటి చూపిస్తూ..చివరికి వారు ఇది కాదు..అలా జరగలేదు అని క్లారిటీ ఇచ్చే వరకు రక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా జబర్ధస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ఈ మద్య రక రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ టీవీ షోతో ఫేమస్ అయిన కమెడియన్ హైపర్ ఆది.. ఈ షోతో అభిమానులను సంపాదించుకున్నాడు. అ
తడి స్కిట్ లకి, సెటైర్లకి మనదేశంలోనే కాదు విదేశాల్లోని తెలుగు వారు సైతం ఫిదా అయ్యారు. అలాంటిది కొద్దిరోజులుగా జబర్దస్త్ షోలో అతడు కనిపించకపోవడం పై రక రకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా హైపర్ ఆదిపై మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొన్ని యూట్యూబ్ చానెళ్లు హైపర్ ఆదికి అమెరికాలో షూటింగ్ జరుగుతుండగా యాక్సిడెంట్ జరిగిందని ఆ కారణంగానే అతడు షోకి దూరమయ్యాడని వార్తలు పుట్టించారు. దాంతో ఆది ఫ్యాన్స్ మొత్తం కంగారు పడ్డారు..అతని సన్నిహితులకు అయితే వెంటనే ఆదికి ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు.
ఈ వార్తలపై తాజాగా హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీపావళి సంధర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. మీ హిట్స్ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాదు తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చాడు..అయితే జబర్ధస్త్ లో ఎందుకు రావడం లేదన్న విషయం మాత్రం వెల్లడించలేదు.