సంక్రాంత్రికి సినిమా వచ్చిదంటే ఏవరేజ్ అయినా కూడా నాలుగు డబ్బులు వెనకేసుకుంటుంది. మన తెలుగు వారి పెద్ద పండుగ ప్రభావం అలాంటిది మరి. అందువల్ల ప్రతీ వాళ్ళు సంక్రాంత్రిని ద్రుష్టిలో పెట్టుకుని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పటికే సంక్రాంతికి సీనియర్ హీరోలు బాలయ్య, వెంకీ, మెగా పవర్ స్టార్ రాం చరణ్ రుమాళ్ళు వేసేశారు. ఇపుడు ఆ కుర్ర హీరో కూడా సై అంటున్నాడుట.


మిస్టర్ మజ్ను" గా అక్కినేని అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నిధి అగర్వాల్ అఖిల్ తో అఖిల్ జోడీ కడుతున్నాడు. నిజానికి మజ్ను అన్న సెంటిమెంట్ అక్కినేని కుటుంబానికి కలసివస్తుంది. లైలా  మజ్నుగా ఆ రోజుల్లో నాగేశ్వరరావు ఓ ఊపు ఊపారు. ఆ తరువాత ఆయన తనయుడు నాగార్జున దాసరి నారాయణరావు డైరెక్షన్లో  మజ్నుగా కనిపించిన్ కనువిందు చేశారు. ఇపుడు మూడవ తరం వారసుడు అఖిల్ మిస్టర్ మజ్ను" అంటున్నాడు.


ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీగా ముందుకు వస్తోందని టాక్. ఈ మూవీలో తన ఏజ్ కి తగిన క్యారక్టర్ అఖిల్ పోషించడంతో పాటు వారసత్వం బలం అయిన రొమాన్స్ ని రంజుగా పండించడంతో హిట్ పై ఫిల్మ్ మేకర్స్ ధీమాగా ఉన్నారు. తొలి ప్రేమ వంటి హిట్ సినిమాను తీసిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని నాగార్జున కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతో హైప్ క్రియేట్ అవుతోంది.


ఈ మూవీకి ముందు రెండు సినిమాలు అఖిల్ ని పూర్తి నిరాశ కలిగించడంతో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారని టాక్. ఈ మూవీని మొదట డిసెంబర్లో రిలీజ్ అని అనుకున్నా ఎందుకో సంక్రాంతికే ఢీ కొట్టాలని  అఖిల్ డిసైడ్ అయ్యాడ‌ట. పెద్ద సినిమాలు, టాప్ హీరోల మధ్య సంక్రాంతి పందెం కోడిగా తొలిసారి కత్తి కడుతున్న అఖిల్ కి ఎంతవరకు కలసివస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: