ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కన్నా ముందే ఆ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి.  విచిత్రం ఏంటంటే..కొన్ని సినిమాలు నిజంగానే ముందే లీక్ అయిన స్టోరికి ఇంచుమించుగా సరిపోతున్నాయి. కొన్ని స్టోరీలు మాత్రం అస్సలు పొంతన లేకుండా ఉంటున్నాయి.  ఏది ఏమైనా పలానా సినిమా స్టీరో లీక్ అనగానే అభిమానులు మాత్రం తెగ ఉత్సాహపడి దాన్ని ప్రచారం చేస్తుంటారు.  గతంలో దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా కథపై రక రకాల ప్రచారాలు జరిగాయి. 
Image result for 2.0 movie stills
ఇక మొదటి భాగంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న విషయంపై యావత్ భారత దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. మొత్తానికి బాహుబలి 2 విడుదల అయిన తర్వాత ఆ సన్నివేశంపై అసలైన క్లారిటీ వచ్చింది.  తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న  '2.ఓ' మూవీ పై అప్పుడే రక రకాల కథనాలు వస్తున్నాయి.  ఈ సినిమా కోసం వైపున రజనీ అభిమానులు .. మరో వైపున అక్షయ్ ఫ్యాన్స్ '2.ఓ' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Image result for 2.0 movie stills
ఇటీవల వదిలిన టీజర్లో అక్షయ్ కుమార్ ను పక్షి రాక్షసుడిగా చూపించారు.   అయితే టీజర్ మొత్తం సెల్ ఫోన్ల గురించే ప్రస్తావించినట్లు కనిపిస్తుంది.  స్మార్ట్ ఫోన్లపై ఆయన ద్వేషం చూపడం ..స్మార్ ఫోన్లు వాడేవారి నుంచి బలవంతంగా వాటిని లాక్కోవడం చూపించారు.  తాజాగా తమిళ నాట ఈ సినిమాపై కొత్త కథనాలు వెలువడుతున్నాయి.  ఈ సినిమాలో అక్షయ్ కుమార్  స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారి చనిపోతాడని..ఎక్కువగా సెల్ ఫోన్ వాడటం వల్ల అతడు రేడియేషన్ గురికావడం..ఆ కారంణంతోనే చనిపోవడం జరుగుతుందట. 

అయితే  '2.ఓ' సినిమా అక్కడ నుంచే మొదలవుతుందట. ఏ సెల్ ఫోన్ అయితే తనను బలి తీసుకుందో దాన్ని పూర్తిగా అంతం చేసేందుకు ఓ దుష్టశక్తిగా పక్షి అవతారంగా మారుతాడట అక్షయ్ కుమార్. అయితే ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ..ఈ సినిమాలో మాత్రం శంకర్ మాత్రం సెల్ ఫోన్ గురించి ఓ మంచి మేసేజ్ మాత్రం ఇవ్వబోతున్నట్లు అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: