మెగాపవర్ స్టార్ రాం చరణ్ లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ చిత్రం వచ్చే సంక్రాంతికి పందెం కోడిలా బరిలో దిగనున్న సంగతి విధితమే. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంటెరెస్టింగ్ విషయాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాను ఫుల్ మాస్ మసాలాగా డైరెక్టర్ బోయపాటి దిజైన్ చేశారని టాక్. రాం చరణ్ ని పక్కా మాస్ హీరోగా ప్రెజంట్ చేస్తూ భారీ హిట్ కొట్టేందుకు అన్ని హంగులు సెట్ చేసారని ఇన్సైడ్ మ్యాటర్.


ఇక ఈ మూవీకి సంబంధించి 80 శాతం షూట్ ఫినిష్ అయిపోయిందని, సాంగ్స్ తీయడమే మిగిలిందని అంటున్నారు. ఆ పని కూడా ముగించుకుని డిసెంబర్ నెలాఖర్లో విశాఖ వేదికగా భారీఎత్తున ఆడియో ఫంక్షన్ ని నిర్వహించేందుకు నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. రాం చరణ్ రంగ స్థలం సినిమ ఆడియో విశాఖ లో చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ అదే సెంటిమెంట్ తో రాం చరణ్ వినయ విధేయ రామను కూడా సాగర తీరంలో చేయాలని డిసైడ్ అయ్యారట.


మరో వైపు ఈ మూవీ టీజర్ కి అనూహ్యమైన స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్ హ్యాపీగా ఉందట. ఒక్క రోజులోనే 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారట. మూవీ కూడా కొత్త రికార్డులు కొల్లగొడుతుందని, కలెక్షన్ల దుమ్ము రేపుతుందని ధీమాగా ఉన్నారు. టీజర్లో రాం చెప్పిన నేను కొణిదెల అన్న డైలాగే ఇపుడు మెగా మంత్రమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: