మీ టూ  ఉద్యమం చల్లారుతుందనుకునే లోపే మళ్ళీ హీట్ ఎక్కుతుంది. హీరోయిన్స్ తమ కు జరిగిన చేదు అనుభవాలను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా హీరోయిన్, మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్‌కు కూడా పెదవి విప్పింది. ఏకంగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆరోపణలు చేయడం బాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. వివరాల్లోకి వెళితే... 2009లో మిస్ లవ్లీ అనే చిన్న సినిమాలో నటించాను. అదే చిత్రంలో నవాజుద్దీన్ కూడా నటించాడు.

నన్ను కౌగిలిలో బంధించి

ఆ సందర్భంగా మా ఇద్దరి మధ్య పరిచయం జరిగింది. అప్పుడు బైపాస్ అనే షార్ట్ ఫిలిం గురించిన సీడీ ఇచ్చాడు. యాక్టింగ్ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పాడు అని నిహారిక తెలిపింది. మిస్ లవ్లీ షూటింగ్‌లో ఓ రోజు నన్ను ఆయన ఇంటికి లంచ్ కోసం పిలిచాడు. ఆ సమయంలో ఆయన చూపించిన ఆదరణ నన్ను ఆకట్టుకొన్నది. అలా మా మధ్య రిలేషన్ బాగా పెరిగింది. తరచూ కలుసుకొనే వాళ్లం. దాంతో అతడిని బాగా నమ్మాను.  ఇలాంటి నేపథ్యంలో ఓ రోజు నాకు మెసేజ్ పంపించాడు. నేను మీ ఇంటి ముందు ఉన్నానని చెప్పడంతో ఇంటిలోకి ఆహ్వానించాను. ఇంటిలోకి రాగానే నన్ను బలంగా కౌగిలించుకోవడంతో షాక్ గురయ్యాను.

 మిస్ ఇండియాను పెళ్లి

వెంటనే అతడిని వెనకకు నెట్టాను. కానీ పట్టు వీడవకపోవడంతో అతడి కౌగిలిలో ఒదిగిపోయాను అని తన పోస్టులో పేర్కొన్నది. అప్పటి నుంచి నవాజ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాను. ఆ సమయంలో నాకు కూడా పరేష్ రావెల్, మనోజ్ బాజ్‌పేయ్ మాదిరిగా మిస్ ఇండియాను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది అని చెప్పాడు. అయితే దానిని నమ్మేశాను. అతడిని చూసి నా చెల్లలు నిజాయితీగా లేడని చెప్పింది. నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఇంకా సోషల్ మీడియాలో పలు ఆరోపణలను నిహారిక సింగ్ చేసింది. కామంతో కళ్లు కప్పుకుపోయిన భారతీయుడు అని తీవ్రంగా స్పందించింది. నవాజ్‌తో ఉన్న తన రిలేషన్ గురించి స్పష్టంగా వెల్లడించింది. అంతేకాకుండా అతడో అబద్దాల కోరు అని ఎండగట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: