మాస్ మహారాజా రవితేజాకు శ్రీనువైట్లకు ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిన విషయమే. ‘నీకోసం’  సినిమాతో కలిసిన వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’ ‘దుబాయ్ శ్రీను’ లు సూపర్ హిట్ మూవీలుగా మారినా ఆతరువాత వీరిద్దరూ పరాజయాల పరంపరతో కొనసాగుతున్న నేపధ్యంలో నిర్మింపబడ్డ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న అత్యంత ఘనంగా జరిగింది. 

సినిమా ఫంక్షన్స్ కు దూరంగా ఉండే ఇలియానాను కూడ రప్పించి ఈమూవీ ప్రమోషన్ గురించి ఎంతగానో కష్టపడుతున్న శ్రీనువైట్ల రవితేజ మనస్తత్వం పై కామెంట్ చేస్తూ మాస్ మహారాజాను ట్రబుల్ షూటర్ అంటూ కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.  ఈమూవీ విజయం శ్రీనువైట్లతో పాటు రవితేజాకు కూడ చాలకీలకం అయిన నేపధ్యంలో ఈమూవీ నిర్మాణ విషయంలో మాస్ మహారాజా శ్రీనువైట్లను విపరీతంగా టెన్షన్ పెట్టాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. 

ఈవార్తలను నిజం చేస్తూ ఈ ఫంక్షన్ లో శ్రీనువైట్ల పూర్తిగా టెన్షన్ తో కనిపించడమే కాకుండా అతడి మాటలు కాస్త తడబడడం వేదిక వద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో 8 నెలలు తాను పడ్డ కష్టాన్ని శ్రీనువైట్ల వివరిస్తూ ఈ మూవీ స్క్రిప్ట్ మేకింగ్ విషయంలో రవితేజా ఎప్పుడూ లేనివిధంగా తనకు ట్రబుల్ షూటర్ గా మారి తనను పెట్టిన స్వీట్ టార్చర్ ను నవ్వుతూ వివరించి ఈఫంక్షన్ లో అందరికీ నవ్వులు తెప్పించాడు శ్రీనువైట్ల. 

ఇదే సందర్భంలో ఈసినిమాలో రవితేజా ఒకనాటి ఫుల్ ఎనర్జీని మళ్ళీ ప్రేక్షకులు చూడబోతున్నారు అన్న సంకేతాలు ఇస్తూ తాను తీసిన సినిమాల్లో అత్యంత లగ్జరీగా తీసిన సినిమాగా మారిందని అంటూ ఈసినిమాకు తన కష్టకాలంలో తోడుగా నిలిచిన రవితేజాకు కృతజ్ఞతలు తెలియచేసాడు శ్రీనువైట్ల. వాస్తవానికి రవితేజా తనకు స్నేహితుడే అయినప్పటికీ పని విషయం వచ్చేసరికి రాక్షుడులా మారిపోయే అతడి తీరు ఎవరికైనా తట్టుకోవడం కష్టం అంటూ శ్రీనువైట్ల చేసిన కామెంట్స్ పైకి నవ్వు తెప్పిస్తున్నా లోలోపల ఈమూవీ ఇజయం గురించి అతడు పడుతున్న టెన్షన్ ను తెలియచేస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: