ఈవారం విడుదల కాబోతున్న శ్రీనువైట్ల రవితేజాల కాంబినేషన్ లో రూపొందింప బడ్డ ‘అమర్ అక్బర్ అంటోనీ’ మూవీ విజయానికి ఈమూవీ టీజర్ లో ఉపయోగించిన డైలాగ్ శాపంగా మారుతుందా అన్న కామెంట్స్ వస్తున్నాయి.  గతంలో  ‘బాద్ షా’ సినిమా తీసే సమయానికి టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకడుగా శ్రీను వైట్లకు విపరీత మైన గుర్తింపు ఉండేది.

వైట్లతో సినిమాలు చేయడానికి చాలామంది టాప్ హీరోలు ఆశక్తి కనపరచేవారు. అయితే ఆసినిమా తర్వాత మూడే మూడు సినిమాలతో శ్రీనువైట్ల కెరియర్ పాతాళానికి పడిపోయింది ‘ఆగడు’ ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ సినిమాల పరాజయం  వైట్ల ఇమేజ్ నువిపరీతంగా డ్యామేజ్ చేసింది. దీనికి తోడు శ్రీనువైట్ల సినిమాలన్నీ ఒకే ఫార్మాట్ లో సాగుతూ ఉండటంతో ప్రస్తుత తరం ప్రేక్షకుల మొహం మొత్తేలా ఇతడి సినిమాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో శ్రీనువైట్లకు మరోసినిమా రావడం ఒకవేళ వచ్చినా   పెద్దహీరో పెద్దనిర్మాత ఛాన్స్ యివ్వడం అసాధ్యం అనుకున్నారు. అయితే  ఆశ్చర్యకరంగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి బడా సంస్థలో రవితేజ లాంటి పెద్దహీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న శ్రీనువైట్ల  మళ్ళీ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదలకాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రమోషన్లు కొంచెం వెరైటీగా ఉండటంతో ఏదో కొత్తగా శ్రీనువైట్ల  ట్రై చేస్తున్నాడనుకున్నారు. కానీ ఈమూవీ టీజర్ అదే విధంగా ఈమూవీ ట్రైలర్  చూసిన వారు శ్రీనువైట్లలో మార్పులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ముఖ్యంగా ఈమూవీ టీజర్ లో ఉపయోగించిన ఒక డైలాగ్ ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. ‘‘వాడు ఎక్కడుంటాడో తెలియదు.. ఎలా ఉంటాడో తెలియదు’’ అంటూ హీరో గురించి విలన్ అంటాడు. ఈడైలాగ్ తెలుగు సినిమాల్లో వినీ విని విసుగెత్తిపోయి ఉన్నారు జనాలు. కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ వినిపించే డైలాగ్ ఇది. ఈడైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా మీద జనాలకు ఒక అంచనా వచ్చేయడంతో శ్రీనువైట్ల మళ్లీ ఏదో రొటీన్ సినిమా తీశాడేమో అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే  ‘అమర్ అక్బర్ ఆంటొని’ కి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోయిన నేపధ్యంలో ఈవారం విడుదలకాబోతున్న ఈమూవీ రొటీన్ సినిమాగా మారితే శ్రీనువైట్ల రవితేజల కెరియర్ కు పెనుప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: