తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్స్ వస్తున్న విషయం తెలిసిందే.  కేవలం రజినీ ఇమేజ్ తోనే కలెక్షన్లు రాబడుతున్నాయని టాక్. రజినీ నటించిన ‘లింగ’ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడం..ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడం..నష్టపరిహారం చెల్లించాలని పెద్ద గొడవ చేయడం తెలిసిందే.  ఆ తర్వాత వచ్చిన కబాలి పరిస్థితి కూడా అదే అయినా..కలెక్షన్లు బాగానే రాబట్టాయి.  ఈ మద్య రిలీజ్ అయిన కాలా చిత్రం పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న  '2.ఓ' పై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. 
Related image
ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  అత్యంత భారీ బడ్జెట్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు.  గతంలో బాషా చిత్రంలో మాఫియా లీడర్ గా కనిపించినట్లే ఈ చిత్రంలో కూడా మాఫియా లీడర్ గా కనిపించబోతున్నాడని టాక్. 
Image result for rajinikanth petta movie
ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన '2.ఓ' సినిమాను రిలీజ్ చేయడానికి శంకర్ సిద్ధమయ్యాడు.   అయితే ‘పేట్ట’చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ 2.ఓ' రిలీజ్ చేసిన చాలా తక్కువ గ్యాప్ లో 'పెట్ట' రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని రజనీకి సన్నిహితులు చెప్పారట.
Image result for rajinikanth petta movie
ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా 'పేట్ట' రిలీజ్ కి మరికాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వమని కోరారట.  దాంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు వెంట వెంటనే తన చిత్రాలు రిలీజ్ కావడంపై రజినీ కూడా సుముఖతగా లేరని..ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడమే మంచిదని  దర్శకనిర్మాతలతో రజనీ చెప్పినట్టుగా సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: