బాలీవుడ్ లో సంచల తార రాఖీ సావంత్ గత కొంత కాలంగా ఎన్నో కాంట్రవర్సరీ కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.  ఈ మద్య మీ టూ ఉద్యమం నేపథ్యంలో నటి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  దాంతో బాలీవుడ్ లో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది.  తనుశ్రీ దత్తాకు బాలీవుడ్ నుంచి కొంత మంది నటీమణులు మద్దతు పలికారు..కానీ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మాత్రం తీవ్ర వ్యతిరేకత చూపించారు. 
Image result for rakhi sawant
అంతే కాదు సోషల్ మీడియా సాక్షిగా తనూశ్రీ పై సంచలన ఆరోపణలు చేసింది.  ఇదిలా ఉంటే..హరియాణాలోని పంచకులలో ఇటీవల జరిగిన కుస్తీ పోటీలలో ఓ రెజ్లర్ చేతిలో బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. తాజాగా వైద్యులు డిశ్చార్జ్ చేశారు.  తాజాగా బయటకు వచ్చిన రాఖీ సావంత్ మరోసారి తనూశ్రీ దత్తాపై సంచలన కామెంట్స్ చేసింది.  రెజ్లర్ నాపై దాడి చేయడానికి కారణం అంటుంది. 
Image result for rakhi sawant ta nu sri datta
‘కావాలనే ఆ రెజ్లర్ నన్ను గాయపరిచింది. తను శ్రీ దత్తా నుంచి డబ్బులు తీసుకొని ఇంకోసారి నేను డ్యాన్స్ వేయకుండా ఆమె నా వెన్నును విరిచింది. ఇండియా, అమెరికా, ప్రపంచం మొత్తంలో ఉన్న నా అభిమానులందరూ నాకు అండగా ఉండండి, ఆ బ్రిటీష్ వారి మీద పోరాడదాం’ అంటూ ఓ ట్వీట్ చేసింది.   అంతే కాదు మరో వీడియోలో ‘మా అమ్మ దగ్గరికి వెళ్లాలనుకుంది. నేను ఇలా చేసింది పబ్లిక్ స్టంట్ కోసం కాదు. నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: