ఇద్దరు సూపర్ స్టార్ ఒకే సారి కలవడం చాలా రేర్ గా జరుగుతుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ గా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ అనే భేదం లేకుండా మహేష్ బాబు చిత్రాలంటే ఎంతో అభిమానిస్తారు తెలుగు ఫ్యాన్స్. ఈ మద్య మహేష్ నటించి చిత్రాలు తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాడు..దాంతో అక్కడ కూడా మహేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మహేష్ చిత్రాల్లోనే కాదు వాణిజ్య ప్రకటనల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.
ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. మహేష్ ఏపషియన్ సినిమాస్తో కలిసి.. ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మల్టీప్లెక్స్ లో మొదట అమీర్, అమితాబచ్చన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ’రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. తాజాగా రజనీకాంత్ 2.0 చిత్రంలో ఏఎంబి మల్టీప్లెక్స థియేటర్లను ఓపెన్ చేయాలని మహేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. 2.0 చిత్రం ప్రమోషన్స్లో భాగంగా చిత్రబృందంతో పాటు రజనీకాంత్ హైదరాబాద్కు రానున్నారు.
ఇదే సమయంలో తన మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభిస్తారని అనుకుంటున్నారు.. కాగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు భారీ సాంకేతిక హంగులతో నిర్మించబడ్డాయి.. ప్రేక్షకులు సినిమా చూడటానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.