రకుల్ ప్రీత్ సింగ్ ఈ పంజాబీ భామ ఏకంగ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేసి టాలీవుడ్ కి వచ్చేసింది. అది మొదలు బంపర్ ఆఫర్లెన్నో పట్టేసి స్టార్  హీరోయిన్ స్టాటస్ సంపాదించేసింది. ఇపుడు కోలీవుడ్ కి మెల్లగా షిఫ్ట్ అయిన ఈ అమ్మడు చాన్స్ దొరికితే ఏకంగా బాలీవుడ్లోనే జెండా పాతేయాలనుకుంటోంది. అందుకోసం నానా కష్టాలు పడుతోంది.


జీరో సైజ్ కోసం రకుల్ ఈ మధ్యన  చాలానే శ్రమ పడినట్లుంది బాలీవుడ్ కి సరిపోతే కొలతలతో తళతళలాడిపోతూ లేటెస్ట్ గా ఈ భామ ఇచ్చిన ఫోజులు చూస్తే మతి పోతోంది. ఆ జిగి, బిగితో ఉత్తరాదిని ఊపేయడానికి రెడీ అంటోంది.  బాలీవుడ్లో  దే దే ప్యార్ దే చిత్రంలో రకుల్  ప్రస్తుతం నటిస్తోంది. ఇందుకోసమేనట ఈ బొద్దు గుమ్మ కాస్తా జిమ్ములు పట్టుకుని తిరిగిందని అంటున్నారు.


ఇక తెలుగులో రకుల్ ఈ మధ్యనే ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటించి అందుకు గానూ భారీ పారితోషికమే అందుకుంది. ఇక కోలీవుడ్లో   బ్రదర్స్ సూర్య - కార్తీల సరసన నటిస్తోంది. ఎన్ జీకే - కార్తీ 17 లో కూడా రకుల్ కథానాయికగా ఎంపికైంది. అలాగే  శివకార్తికేయన్ 14వ చిత్రంలోనూ రకుల్ కథానాయిక. 


మొత్తానికి రకుల్ టాలీవుడ్ నుంచి కోలీవుడ్ మీదుగా బాలీవుడ్ కి ఎగబాకేస్తోంది. ఎప్పటికైనా అక్కడే కొట్టాలి అని టార్గెట్ పెట్టుకున్న ఈ భామ ఆ దిశగా బలంగానే అడుగులు వేస్తోంది. ఈ సినిమాల సంగతెలా ఉన్నా లేటెస్ట్ గా రకుల్ పెట్టిన హాట్ హాట్ ఫోజులు చూసి కుర్రాళ్ళు బేజారవుతున్నారు.
    


మరింత సమాచారం తెలుసుకోండి: