అత్యంత రహస్యంగా, కనీసం ఒక్క ఫోటో కూడా అధికారికంగా బయటకు రాకుండా, ఇటలీలో నిన్న డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తనదైన శైలిలో స్పందించారు. బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్ ల వివాహం ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి సంప్రదాయంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. ఇటలీలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
Smriti Irani Post Viral for Deepika Ranveer Marriage Photos
కాగా, ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాకపోవడం ఆశ్చర్యం. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా వీరిద్దరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోగా, వీరి వివాహ చిత్రాలు చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో స్మృతీ ఇరానీ స్పందిస్తూ, "దీప్‌వీర్‌ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది" అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్థిపంజరం ఫోటోను పోస్టు చేశారు.
Ranveer-Singh-and-Deepika-Padukune
స్మృతిలోని హాస్య చతురతను అభినందిస్తూ, ఈ పోస్టుకు వేలకొద్దీ లైక్స్ వచ్చాయి. కాగా, దీప్, వీర్ ల పెళ్లి ఫోటోలు విడుదల చేస్తే చూడాలని సినీ ప్రముఖులతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  నిన్న కొంకణి సంప్రదాయంలో ఒకటైన ఈ జంట, నేడు సింధీ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఈ నెల 21న బెంగుళూరులో, 28న ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. నిశ్చితార్థ వేడుకలో భాగంగా రణ్వీర్ దీపిక వేలికి ఉంగరం తొడుగుతుండగా దీపిక భావోద్వేగానికి లోనైందని సమాచారం తెలిసింది. పెళ్లి జరిగే లేక్ కోమో వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: