ఈతరం హీరోల్లో.. స్టార్ డమ్ సొంతం చేసుకున్న అతి కొద్దిమందిలో విజయ్ దేవరకొండ ఒకడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలో మంచి విజయాన్నిఅందుకున్న విజయ్ దేవరకొండ ఆ మద్య ‘నోటా’ సినిమాతో ఒక ఫ్లాప్ పొందాడు. అయితే గీతాగోవిందం మూవి విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు..ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. అనతి కాలంలోనే అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు. అలాంటి విజయ్దేవరకొండ సినిమాలు మానేద్దామని నిర్ణయించుకున్నాడట. అదెప్పుడో.. అవకాశాల కోసం తిరిగి తిరిగి విసిగిపోయి తీసుకున్న నిర్ణయం కాదు.
‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ సినిమాల హిట్తో హీట్లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుదామనుకున్నాడట. అదేంటీ అని అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం..కానీ ఈ మాటలు స్వయంగా విజయ్ చెప్పడం షాక్ కి గురి చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నిర్మితమైన 'టాక్సీవాలా' .. ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఈ సినిమా పైరసీ సైట్లలో లీక్ అయిందనే వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. ఈ సినిమా సమయంలో తమకి ఎదురైన కష్టాలను గురించి ప్రస్తావించాడు.
ఓరోజు మా అమ్మకి ఒంట్లో బాలేదు. కార్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నా... అమ్మ పరిస్థితి చూసి భయమేసింది. ఎందుకో ఆ క్షణం ఈ సినిమాలన్నీ వదిలేయాలి అనిపించింది. నిర్మాతలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పేద్దామనుకున్నా. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయాలనిపించింది. దర్శక నిర్మాతలకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పేశాను కూడా.
కానీ వారు ఇచ్చిన ధైర్యంతో సినిమా కంటిన్యూ చేశాను. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తన తండ్రికి కేన్సర్ అనే చేదు నిజాన్ని తట్టుకుంటూ పనిచేశాడు. అన్ని వత్తిడులతో సినిమా పూర్తి చేస్తే..ఆ సినిమా లీక్ అయి నెట్ లో చక్కర్లు కొడుతుందన్న వార్త వింటే ఏలా ఉంటుందో కసారి ఆలోచించండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ముందు సినిమా తరవాత సినిమా అనే పద్ధతితోనే వెళ్తా. అప్పుడు నాకోసం నేను కాస్త సమయం కేటాయించుకునే అవకాశం దక్కుతుందని అంటున్నాడు.