ప్ర‌తి ఏడాది ఏదో ఒక ప్లేస్‌లో 80వ దశకం నాటి తార‌లు అంద‌రు క‌లిసి థీమ్ పార్టీ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  తాజాగా 80వ ‘సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అలనాటి హీరో హీరోయిన్లు ఏకమై గెట్ టు గెదర్ పార్టీ నిర్వహించారు. గ‌త ఏడాది మ‌హాబ‌లిపురం వ‌ద్ద స‌ముద్ర‌తీరంలో క‌లుసుకున్న స్టార్స్ ఈ సారి వేరే చోట క‌లిసారు.
1980 సౌత్ స్టార్స్ గెట్ టు గెదర్ అదరహో
80వ సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో జరిగిన ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమకి చెందిన స్టార్స్ అందరు పాల్గొన్నారు. గ‌త ఏడాది ఈ పార్టీలో చిరంజీవి, వెంక‌టేష్‌లు క‌నిపించ‌గా ఈ సారి వారు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న గైర్హాజ‌రు అయిన‌ట్టు తెలుస్తుంది.  వరుసగా తొమ్మిదవ ఏడాది జరిగిన ఈ పార్టీలో మోహన్ లాల్, భాను చందర్, సుమన్, అర్జున్, శరత్ కుమార్, నరేష్, సత్యరాజ్, భాగ్యరాజ్ సుహాసిని, ఖుష్బు,రమ్యక్రిష్ణ , రాధ, నదియ తదితరులు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్‌లో హాజరయ్యారు.
1980 సౌత్ స్టార్స్ గెట్ టు గెదర్ అదరహో
సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ త‌న ట్విట్ట‌ర్‌లో సౌత్ స్టార్స్‌తో క‌లిసి దిగిన ఫోటోస్‌ని షేర్ చేస్తూ .. 9వ రీయూనియ‌న్‌లో 80వ ద‌శ‌కం నాటి తార‌లంద‌రం క‌లిసాము. అంద‌రితో టైం చాలా స‌ర‌దాగా గ‌డిచింది అని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగు నుండి చిరంజీవి, వెంకటేష్‌లతో సహా చాలా మంది మిస్ అయ్యారు.  అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకే చోట కలవడం ఫ్యాన్స్ కి కన్నుల పండువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: