బాలీవుడ్ లో ఇప్పటి వరుకు ఎంతో మంది నటులు తమ కామెడీతో నవ్వించారు. అయితే టెలివిజన్ సెట్స్ లో తనదైన వెరైటీ కామెడీతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు కపిల్ శర్మ. నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాతగా అన్ని రంగాల్లో కపిల్ శర్మ తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోలతో కామెడీ ఇంటర్వ్యూ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నాడు. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు. 2015 సెప్టెంబరు 25న విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్. తాజాగా కమెడీయన్ కపిల్ శర్మ పెళ్లిపీఠలు ఎక్కబోతున్నాడు. ఈ సంవత్సరం బాలీవుడ్ లో స్టార్స్ పెళ్ళి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా గిన్నీ ఛత్రాత్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న కపిల్ శర్మ ఈ ఏడాది సమ్మర్లో.. ఆమెని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 12న గిన్నీ సొంత ఊరు జలందర్కి దగ్గరలో ఉన్న పగ్వరా అనే ప్రాంతంలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.
పెళ్ళి తర్వాత రెండు రిసెప్షన్లని ఏర్పాటు చేయగా, కుటుంబ సభ్యుల కోసం డిసెంబర్ 14న అమృతసర్లో ఒక రిసెప్షన్ జరగనుంది. రెండోది డిసెంబర్ 24న ముంబైలో ఏర్పాటు చేయనున్నారు.కపిల్ శర్మ ఇటీవల నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే చిత్రానికి కపిల్ సహా నిర్మాతగా వ్యవహరించగా ఈ మూవీ అక్టోబర్ 12న విడుదలై మంచి విజయం సాధించింది.