తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.  భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత అద్భుతమైన టెక్నాలజీ వాడిన ఘనత శంకర్ కే దక్కింది.  ఈ చిత్రం ఘన విజయం తర్వాత అటు శంకర్, ఇటు రజినీకాంత్ కి పెద్దగా హిట్స్ రాలేదు.  దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో రోబో సీక్వెల్ రాబోతుంది.  స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ 2.0. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ చిత్రం నవంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. 
Related image
వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో థియేటర్లో పడాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృస్తుంది.  ‘2.ఒ’ మూవీ మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం మాత్రమే ఉండ‌డంతో జ‌నాల‌లోకి తీసుకేళ్ళేందుకు నిర్మాత‌లు వినూత్న ఆలోచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్‌తో పాటు వాట్సాప్‌లోను ప‌లు జిఫ్ ఇమేజ్‌లు, స్టిక్ట‌ర్స్‌, మీమ్స్ రిలీజ్ చేశారు. వీటిని నెటిజ‌న్స్ వివిధ ర‌కాలుగా వాడుతుండ‌డంతో చిత్రానికి మంచి ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంది.
Image result for 2.0 posters
ఈ సినిమా మొత్తాన్ని శంక‌ర్ 3డీ కెమెరాల‌తో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది.  అంతే కాదు  చిత్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు 11000 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ ఉండ‌గా,వీటికి సంబంధించిన వ‌ర్క్ విదేశాల‌లో జ‌రిపారు.  ప‌లువురు హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకి పని చేయగా, చిత్రం ప్ర‌తి సినీ ప్రేక్ష‌కుడికి స‌రికొత్త అనుభూతి క‌లిగించ‌నుంద‌ని అంటున్నారు.
Related image
భార‌తీయ సినిమా చ‌రిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .  ఈ చిత్రంలో ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మార‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: