ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ చిత్రంతో మహేష్ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు.  అంతే కాదు మొదటి సారిగా సీఎం పాత్రలో నటించి మెప్పించాడు.  ప్రస్తుతం మహేష్, వంశి పైడిపల్లి కాంబినేషన్ లో ‘మహర్షి’ చిత్రం రూపొందుతుంది.  ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ విలెజ్ సెట్ వేశారు. 

ఇందులో గ్రామీణ నేపథ్యంలో కొన్ని అద్భుతమైన సీన్లు చిత్రీకరించబోతున్నారట. అంతే కాదు రైతుల తరఫున మహేశ్ బాబు పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  కాగా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట.  అమెరికాలో గొప్ప కంపెనీకి సీఈవోగా పనిచేసిన వ్యక్తి తన స్నేహితుడి కోసం ఓ మరుమూల ప్రాంతంలో పేద రైతుగా ఉంటూ రైతుల గురించి పోరాడే యువకుడిగా కనిపించబోతున్నాడట.

ఆల్రెడీ అమెరికాలో షూటింగును పూర్తి చేసిన టీమ్, ప్రస్తుతం రైతు నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ కి ముందు ఈ సీన్స్ వస్తాయట. దిల్ రాజు - అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: