తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే మహానటి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.  ఈ చిత్రం రెండు బాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

ఇక దర్శకుడు మహి. వి రాఘవ్ .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను 'యాత్ర' పేరుతో రూపొందించాడు. ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని రాజకీయ మలుపులు .. ఆయన కొనసాగించిన పాదయాత్ర నేపథ్యంలో సాగే చిత్రం.   మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, డిసెంబర్ 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. 


అయితే ఇదే రోజు  'పడి పడి లేచే మనసు' .. 'అంతరిక్షం' .. 'కేజీఎఫ్' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటం వలన, 'యాత్ర'ను జనవరికి వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: