తెలుగు ఇండస్ట్రీలో హీరో రామ్ సరసన ‘నేను శైలజ’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.  ఆ తర్వాత హీరో నాని నటించిన ‘నేను లోకల్’తో మరో సక్సెస్ అందుకుంది.  ఇలా వరుస విజయాలతో దూసుకువెళ్తున్న కీర్తి సురేష్ కి మరో అద్భుతమైన అవకాశం వచ్చింది..అదే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’చిత్రం.  ఈ చిత్రం కీర్తి సురేష్ నటన చూసి అన్ని వర్గాల ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 
Image result for keerthi suresh
మొదటి నుంచి గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గా విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రంతో మరో విజయాన్ని దక్కించుకుంది.  ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.  అందం .. అభినయంతో పాటు ఈ అమ్మడికి అదృష్టం కూడా కలిసి వస్తుంది.  వరుసగా అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. 
Related image
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని..మంచి నటనకు మాత్రమే ఇస్తానని..అవసరమైతే..డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమని చెబుతోంది. బలమైన కథాకథనాలు .. పాత్రకి ప్రాధాన్యత ఉండాలిగానీ, డీ గ్లామర్ గా కనిపించడానికి తాను రెడీగా వున్నానని చెప్పింది.  అలాంటి కథలు ఏ దర్శక, నిర్మాతలు తీసుకు వచ్చినా నటించడానికి తాను రెడీగా ఉన్నానని అంటుంది ఈ బొద్దుగుమ్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: