ఆయన అసలే మాటల మాంత్రికుడు. కలంలో  సకలం చూపించి కలకలం రేపేస్తాడు.  పంచు డైలాగులు చించి తెరపై నవ్వులు పూయిస్తాడు, మరో సారి ఆలోచింపచేసే డైలాగులతో బుర్రలకు పదును పెడతాడు. ఇక సినిమాను  ఆద్యంతం తనదైన స్టైల్లొ  నడుపుతూ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. ఈ మధ్య రేసులో కాస్తా వెనకబడినా మళ్ళీ అరవింద సమేతతో తనేంటో ప్రూవ్ చేసుకున్న త్రివిక్రం ఇపుడు సరికొత్త క్రేజీ కాంబోతో రాబోతున్నాడని టాక్.


మెగస్టార్ చిరంజీవి తరువాత చిత్రానికి డైరెక్టర్ గా త్రివిక్రం  శ్రీనివాస్ సెలెక్ట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం సైరా మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో రైతు సినిమాను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత పట్టలెక్కబోయేది త్రివిక్రం దర్శకత్వంలోని మూవీయేనని అంటున్నారు. త్రివిక్రం తన జోనర్ అయిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ ట్రాక్ తో కూడిన ఓ కధను  ఈ మధ్యన మెగాస్టార్ కి వినిపించడం దానికి ఆయన ఎస్ ప్రొసీడ్ అని చెప్పడం చక చకా జరిగిపొయాయి. దాంతో ఈ క్రేజీ కాంబోకి రంగం రెడీ అయిపోయింది.


 త్రివిక్రం ఇపుడు అల్లు అర్జున్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. చిరంజీవి కూడా సైరా తరువాత కొరటాల మూవీ చేస్తారు. అంటే దాదాపు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకూ ఈ ఇద్దరూ బిజీ అన్న మాట. ఆ తరువాత అంటే వచ్చే ఏడాది చివర్లో త్రివిక్రం తో మెగా మూవీ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ మూవీ ఎంతటి  సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: