ఇప్పుడు దేశ వ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం కొనసాగుతుంది.  ఇండస్ట్రీలోనే కాదు వివిధ రంగాల్లో మహిళలపై పురుషుల లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమం ఫలితంగా ఏకంగా ఓ మంత్రి తన పదవిని పోగొట్టుకోవాల్సి ఉంది.  ఎంతో మంది ప్రముఖులు రంగు బయట పడుతుంది.  బాలీవుడ్ హీరోయిన్స్ తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహటంగా చెప్పడంతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  వీరికి ఎంతో మంది నటీ,నటులు మద్దతు కూడా పలికారు. 
Related image
లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సమాజం తన వంతు సానుభూతి చూపించింది.  దక్షిణాదిన మీ టూ ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి తన గళమెత్తింది..ఆమెకు ఎంతో మంది మద్దతు పలికారు.  ఓ వైపు ‘మీ టూ ’ఉద్యమం ఉధృతమవుతుంటే..ఓ హీరోయిన్ మాత్రం తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని..అలా అయితే బాగుండు అని వ్యంగంగా సమాధానం చెప్పడంతో విషయం కాస్త సంచలనంగా మారిపోయింది.  వివరాల్లోకి వెళితే..ఒకప్పుడు తెలుగు మహేష్ బాబు సరసన ‘రాజకుమారుడు’ సినిమాలో నటించిన ప్రీతి జింటా ఓ ఇంటర్వ్యూలో భాగంగా  నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అయి ఉంటే బాగుండేది. దీని గురించి ఇంకా బాగా వివరించేదాన్ని.
Related image
అయినా మనల్ని అవతలివాళ్లు ఎలా చూడాలని మనం అనుకుంటామో అలాగే చూస్తారు అంటూ ప్రీతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇవాళ్టి స్వీటూ.. రేపటి మీటూ కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ..కామెంట్ చేయడంతో కొంత మది నెటిజన్లు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దేశ వ్యాప్తంగా లైంగిక వేధింపులకు ఇబ్బందులు పడుతున్న మహిళలపై కనీసం సానుభూతి లేకుండా.. ఇంత సీరియస్ అంశంపై చాలా సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ట్విటర్‌లో చాలా మంది ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: