మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  ఇండస్ట్రీకి వచ్చి వరుసగా హిట్స్ అందుకున్న ఈ మెగా హీరో గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నాడు.   రీసెంట్ గా వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దాంతో తన తదుపరి చిత్రం మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు సాయిధరమ్ తేజ్.  ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయడానికి చాలా రోజుల క్రితమే సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఈ చిత్రం లాంచ్ కూడా అయ్యింది. 

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ అయితే వీరి పేర్లు చిత్ర, లహరి అందుకే ఈ చిత్రం పేరు ‘చిత్రలహరి’అని పెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

కిషోర్ తిరుమల యూత్ ని దృష్టిలో పెట్టుకొని చిత్రాలు తీస్తారు. ఆయన చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి.  ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు చిత్ర యూనిట్. ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతోనైనా సాయిధరమ్ తేజ్ కి హిట్ కొడతాడేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: