తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కథలు అందించన సినీ రచయిత బీబీఎస్ రవికి ఎంతో మంచి పేరు ఉంది. అందరు నటీ, నటులతో బీవీఎస్ రవి చాలా అనుకువగా ఉంటారని టాక్. ఇండస్ట్రీలో ఆయనను మచ్చ రవి అని ముద్దుగా పిలుస్తారు. బీవీఎస్ రవి అందించిన కథతో పలు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానని..ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకు బాగా దగ్గరయ్యానని అన్నారు.
ఆయన సినిమాలన్నా..పాటలన్న ఎంతో అభిమానం. మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరా విరామం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి ఎంతో సంతోషించాను. ఆయనకు ఓ మంచి కథ వినిపించాలని ఎంతో ఉత్సాహ పడ్డాను. ఆ విధంగా నేను ఏడాదిన్నర పాటు కష్టపడి చిరంజీవి గారి 150వ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేశాను.
చిరంజీవి గారికి 99 శాతం కథ నచ్చేసింది. ఒక్క శాతం దగ్గర కథ ఆగిపోయింది. కానీ నాకు ఏమాత్రం బాధ అనిపించలేదు.. మొత్తానికి నా అభిమాన హీరోకి కథ చెప్పాను..నచ్చడం నచ్చకపోవడం నా అదృష్టం అనుకొని అక్కడే ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చారు.