ఇప్పటి వరకు భారత దేశానికి చెందిన ప్రముఖుల మైనం బొమ్మలు మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే.  క్రీడా, సినీ, రాజకీయ, ఇతర రంగాల్లో సేవలందించిన వారు..బాగా పాపులర్ అయిన వారి మైనపు బొమ్మలు ఇక్కడ ఆవిష్కరిస్తారు.  ఆ మద్య తెలుగు హీరో ప్రభాస్ కి సంబంధించిన బొమ్మ కూడా అక్కడ ఏర్పాటు చేశారు.  బాహుబలి సీరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. 
Image result for anushka madam tushar museum
తాజాగా ప్రముఖ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సతీమణి నటి అనుష్క శర్మ సంబంధించిన మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.  తాజాగా మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటైన తన మైనపు బొమ్మను చూసి అనుష్క ఒక్కసారే షాక్ తినడమే కాదు..తెగ సంతోషంలో మునిగిపోయిందట. అంతే కాదు దానితో సెల్ఫీ తీసుకుని మురిసిపోయింది. 
Image result for anushka madam tushar museum
ఇక మ్యూజియంలో ప్రస్తుతం వారు ఏ ఫీల్డ్ లో ఉన్నారో దానికి సంబంధించిన భంగిమల్లోనే ఏర్పాటు చేస్తుంటారు.  అనుష్క  ప్రతిమ చేతిలో ఓ సెల్ ఫోన్ ఉంటుంది. దానితో ఎవరైనా సెల్ఫీ దిగవచ్చు. ఆ వెంటనే డిజిటల్ రూపంలో ఆ చిత్రం ట్రాన్స్ ఫర్ అవుతుంది.  తన ప్రతిమను చూసుకొని ఆశ్చర్య పోయిన అనుష్క ఈ బొమ్మ ఎంత సహజ సిద్ధంగా ఉందంటే.. నేనే అదిరిపడ్డాను" అని వ్యాఖ్యానించింది. వెంటనే ఆ ప్రతిమతో సెల్ఫీ దిగింది. కాగా, ప్రస్తుతం అనుష్క, షారూక్ హీరోగా నటిస్తున్న 'జీరో' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: