టాలీవుడ్, కోలీవుడ్ లో ఎప్పుడూ బ్లాక్బస్టర్ పాటలు, పెద్ద పెద్ద చిత్రాల డిస్కషన్స్లో మాత్రమే వినిపించే దేవిశ్రీప్రసాద్ గత వారం రోజులుగా గాసిప్ కార్నర్స్లో మార్మోగుతోంది. నటి పూజిత పొన్నాడని దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా జోరందుకుంటోన్న ఈ పుకారు దేవి చెవిన పడిందో లేదో తెలియదు కానీ మనోడు మాత్రం ప్రస్తుతం తన చిత్రాలతో ఫుల్ బిజీగా వున్నాడు. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది పూజిత. 'రంగస్థలం', 'బ్రాండ్ బాబు' ఇలా చాలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నది.
‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి లవర్గా నటించిన పూజిత పొన్నాడతో దేవి క్లోజ్ అయ్యాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకుముందు ఛార్మితో దేవి క్లోజ్గా వుంటున్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని బాగా ప్రచారం చేసారు. ఈ విషయంలో తాము కేవలం స్నేహితులమే అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడిలా దేవి పర్సనల్ సైడ్ మీడియాకి హాట్ టాపిక్గా మారింది. చేతినిండా చిత్రాలతో, క్షణం తీరిక లేకుండా గడిపే దేవితో పని చేయించుకోవడం కష్టమంటూ ఈ మద్య కొంత మంది దర్శక, నిర్మాతలు ఇతర సంగీత దర్శకులను చూసుకోవాల్సి వస్తుంది.
ఇక యూట్యూబ్ నటుడు అర్జున్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పూజిత. ప్రస్తుతం ఆమె తన భర్తతోనే కలిసి ఉంటుంది. పెళ్లి అయిన అమ్మాయితో దేవిశ్రీప్రసాద్ తో ప్రేమ అంటూ కావాలనే కొందరు వార్తలు పుట్టిస్తున్నారు. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా.. కెరీర్ పరంగా తనను ఏదీ అడ్డుకోలేదని అంటోంది పూజిత. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' అలానే మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది.