సాయిపల్లవి తెలుగులో యువతను ఫిదా చేసిన హీరోయిన్. ఆమె పెద్ద బ్యూటీ కాదు, కానీ ఇట్టే ఆకట్టుకుంటుంది. మన పక్కింటి అమ్మాయే అన్నట్లుగా ఉంటుంది. ఓ విధంగా ట్రడిషనల్ లుక్ ఆమెకు స్పెషల్ ప్లేస్ ని ఇచ్చిందేమో. ఆమె ఫిదా తరువాత చేసిన సినిమాలు ఆ రేంజిలోఅ కాకపోయినా సాయి పల్లవి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి కనిపిస్తోంది. ఆమె ఎంత అంటే అంతేనని అంటున్నారట.


ఇక సాయిపల్లవి లేటెస్ట్ మూవీ పడి లేచే వయసు ఇపుడు సెట్స్ మీద ఉంది. శర్వానంద్ హీరో. ఈ మూవీలో లో చేసిన కొన్ని సీన్లు సరిగా రాలేదని, పర్ఫెక్షన్ కోసం మరో మారు షూట్ కి చిత్ర నిర్మాతలు సాయి పల్లవిని అడిగారట. అయితే సినిమాలో సీన్లు రీ షూట్ కి తనక అభ్యంతరం లేద‌ని, అయితే దానికి కూడా భారీగా పారితోషికం కావాలని సాయి పల్లవి కండిషన్ పెట్టిందట. దానికి సరేనన్న నిర్మాతలు ఆ రీ షూట్ చేస్తున్నారుట.


నిజంగా ఈ కన్నడ కస్తూరి డిమాండ్ అలా ఉందన్న మాట. మామూలుగా రీ షూట్ కి ఎవరూ పెద్దగా డిమాండ్ చేయరు, డేట్లు ఉంటే ఇస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం తనకు ఉన్న మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఇలా చేసిందని అంటున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 21న వెండి తెరపైన కనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో హోప్ బాగా పెరిగింది. ఈ సినిమాను సుధాకర్, ప్రసాద్ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: