శంకర్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటించిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని తెలిసిందే. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నవంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.
సినిమా వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్స్ దాకా రిలీజ్ కాబోతుందట. ముఖ్యంగా దేశం మొత్తం మీద తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 2.ఓ ఏకంగా 1200 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. క్రోమాన్, చిట్టిబాబుల మధ్య యుద్ధంగా వస్తున్న 2.ఓ ట్రైలర్ తో అద్భుతాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


తెలుగులో 1200 స్క్రీన్స్ తో పాటుగా తమిళంలో 750 స్క్రీన్స్, కర్ణాటక 500, కేరళలో 600 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ లో కూడా తెలుగు, తమిళ వర్షన్స్ సెపరేట్ గా భారీ లొకేషన్స్ లో రిలీజ్ అవుతుంది 2.ఓ. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 72 కోట్ల బిజినెస్ చేసింది. ఈమధ్య సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ 20 మినిట్స్ సీట్స్ లో ఎవరు కూర్చోరన్న టాక్ రావడం విశేషం. 


ఐ తర్వాత శంకర్ మూడేళ్లుగా 2.ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆ సినిమా రికార్డులను బద్ధలు కొట్టే సినిమాగా సౌత్ నుండి క్రేజ్ తెచ్చుకున్న సినిమా 2.ఓ. మరి రిలీజ్ అవుతున్న థియేటర్స్ చూస్తుంటే టాక్ బాగుంటే 2.ఓ కలక్షన్స్ బీభత్సం సృష్టించేలా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: