రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమాగా ట్రిపుల్ ఆర్ క్రేజ్ తెచ్చుకుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బిజినెస్ విషయాలు ఇప్పుడే మొదలుపెట్టారట.


తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెకించే ఈ సినిమా 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు డిజిటల్, శాటిలైట్స్ రూపంలో మరో 200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందట. ఎలా లేదన్నా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా 1000 కోట్లు బిజినెస్ చేస్తుందని అంటున్నారు.


ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం అద్భుతంగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఇద్దరు స్టార్స్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ అభిమానుల అంచనాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి కాబట్టి ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా తెరకెక్కించేలా ప్లాన్ చేశాడట. తప్పకుండా ఈ సినిమా మరోసారి రాజమౌళి ప్రతిభ చూపేలా ఉంటుందని అంటున్నారు.  


ఎన్.టి.ఆర్, రాం చరణ్ లను కూడా ఇప్పటివరకు కెరియర్ లో వారు చేసిన పాత్రలన్నిటిని మించి ఉండేలా డిజైన్ చేశారట. ముఖ్యంగా ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్ అద్భుతంగా ఉండబోతుందని అంటున్నారు. మరి రాబోతున్న ఈ ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: