తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు చెర్రీ కెరీర్ లో రెండు వందల కోట్లు క్లబ్ లో చేరాడు. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు రాంచరణ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మద్య ‘వినయ విధేయ రామ’సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ను విడుదల చేశారు.
ఈ పోస్టర్కు ‘కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం’ అనే క్యాప్షన్ను చిత్రబృందం జత చేసింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.