ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకుల జోరు బాగానే కొనసాగుతుంది. కొత్త దర్శకులతో సీరియర్ హీరోలు సైతం సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం యువ దర్శకుడు సురేందర్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఎంతో ప్రిస్టెజెస్ ప్రాజెక్ట్ గా ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు బాగాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా జనవరి నెలలో రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు.
ఆ మద్య కింగ్ నాగార్జున యువ దర్శకుడు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఘన విజయం అందుకున్నాడు. ప్రస్తుతం నాగ్ కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' కథను తయారు చేస్తున్నాడు. మరో వైపున రాహుల్ రవీంద్రన్ , నాగార్జున కోసం ఒక రొమాంటిక్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఎవరు ముందు ప్రాజెక్ట్ పూర్తి చేస్తారన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కథ సిద్దమై అన్ని కుదిరితే రాహుల్ దర్శకత్వంలో నాగ్ నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.
ఆ మద్య నాగార్జున మేనళ్లుడు సుశాంత్ తో 'చిలసౌ' సినిమా ద్వారానే రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్న కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్బంలోనే రాహూల్ తో ఒక సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ ని కథ తయారు చేసుకోమని నాగార్జున చెప్పారు. అలా కథను రెడీ చేసిన రాహుల్, నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాకు 'మన్మథుడు 2' అనే టైటిల్ ను పెట్టనున్నారనీ, త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నారని చెప్పుకుంటున్నారు.