అపూర్వ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన దైనా గుర్తింపు ను తెలుగు ఇండస్ట్రీ లో సాధించింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు.. ఆమె ఏమన్నారంటే... నా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాను. నా తల్లి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అందుకే ఆఫర్లు వచ్చిన నటించడం లేదు. నా తల్లి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ నటిస్తాను. నటించడమంటే నాకు చాలా ఇష్టం అని అపూర్వ తెలిపారు.

 ఎమ్మెల్యేతో సమస్యలు

మాది రాజకీయ నేపథ్య కుటుంబం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై అవగాహన ఉంది. మేము టీడీపీకి చెందిన వాళ్లం. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిస్తే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడనే అనుమానం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి అనుమానాలు తొలిగిపోయాయి. చంద్రబాబు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అపూర్వ అన్నారు. మేము కమ్మ కులానికి చెందిన వాళ్లం. కానీ నాకు కులగజ్జి లేదు. కులాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ టీడీపీకే ఓట్లు వేస్తాం. మాది దెందులూరు నియోజకవర్గం. అక్కడ మా ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు సంతోషం కలిగింది. కానీ అతడి వల్ల నేను చాలా కష్టపడ్డాను అని అపూర్వ చెప్పారు. 

 ఎమ్మెల్యేతో సమస్యలు

మాకు ఎదురైన ఓ వివాదంలో ఎమ్మెల్యే మమ్మల్ని చాలా సమస్యలు సృష్టించారు. మేము ఓటేసిన ఎమ్మెల్యే మాకు నరకం చూపిస్తున్నారు. ఒకవేళ అలానే ఇబ్బందులు పెడితే ఆస్తులు అమ్ముకొని తెలంగాణకు వచ్చేస్తాం. తెలంగాణలో ప్రతీ ఒక్కరికి భద్రత ఉంది. రాజకీయాల్లో హీరో శివాజీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను అపూర్వ తప్పుపట్టారు. ఓ షూటింగ్‌లో మరో హీరోతో గొడవపడ్డాడు. నా కంటే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయని గొడవ జరిగింది. దాంతో షూటింగ్ వాయిదా పడింది. నిర్మాతకు నష్టం జరిగింది. అలాంటిది పట్టించుకొని వ్యక్తికి నిజాయితీ ఉంటుందా? రాష్ట్ర అభివృద్దికి చిత్తశుద్ధి ఉంటుందా? అని అపూర్వ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: