టాలీవుడ్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘నక్షత్రం’సినిమాలతో తనకంటూ మంచి క్రేజ్ ఏర్పాటు చేసుకున్న యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం 'వెంకటాద్రి టాకీస్' అనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై తనే హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.  సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా స్థాపించిన నిర్మాణ సంస్థ వెంక‌టాద్రి టాకీస్ బ్యాన‌ర్‌పై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా సందీప్ కిష‌న్‌, అన్య సింగ్ హీరో‌హీరోయిన్‌గా కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాత‌లుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. 

Related image

దాదాపు 50 ఏళ్ల క్రితం విడుదలైన ‘అంతస్తులు’ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రపంచంలో ఒక రకమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమా రషెస్‌ చూసి విస్తా డ్రీమ్‌ మర్చంట్స్‌ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.  టైటిల్ తో పాటు ఫస్టులుక్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్టు పోస్టర్ కి మంచి మార్కులు పడిపోయాయనే చెప్పాలి. ఇటీవలే బాలీవుడ్ కి పరిచయమైన 'అన్య సింగ్' ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 


కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా అని..ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నామన్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సినిమా అవుతుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామన్నారు. నిర్మాత ద‌యా ప‌న్నెం మాట్లాడుతూ.. ‘‘ద‌ర్శ‌కుడు కార్తీక్ చెప్పిన కథ చాలా బాగుంది. సూప‌ర్ నేచుర‌ల్ నేప‌థ్యంలో సాగే  సినిమా అని చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. మ‌రో ఆరు రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివా చెర్రీ, సీతారాం, కిరుబాకరన్, కెమెరా: ప్రమోద్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: