హీరోనాగార్జున ఈమధ్య ఒక విషయంలో బాగా ఆందోళనపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్వయంగా రంగంలోకి దిగి చైతన్య అఖిల్ కెరియర్ గురించి ఎన్ని ఆలోచనలు చేసినా వారిద్దిరి కేరియర్లు చక్కదిద్దలేక పోవడం  నాగార్జునకు తీవ్రఇబ్బందికి గురిచేస్తోందని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి తన మూడు దశాబ్దాల సినిమా కెరియర్ విషయంలో   ఎప్పుడూ టెన్షన్ తీసుకోని నాగార్జున పిల్లల విషయంలో మాత్రం తీవ్రమైన ఆలోచనలోపడి పోతున్నాడు అతడి సన్నిహితులు కూడ అంగీకరిస్తున్నారు. చైతు హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం అయిన ఇంకా స్టార్ లీగ్ కు చేరలేకపోవడం ఒక ఎత్తైతే ఈమధ్య ఒక హిట్ ఇస్తే   మూడు ఫ్లాపు అతడి కెరియర్ కు కొనసాగడం నాగార్జునకు సమాధానం లేని ప్రశ్నగా మారింది అని అంటున్నారు. 

దీనికితోడు చైతన్య సినిమా ఎంత హిట్ అయినా అది పాతిక కోట్ల మార్క్ ను దాటకపోవడం కూడా  నాగ్ ను విపరీతమైన ఆలోచనలో పడేసిందనిటాక్. ‘శైలజా రెడ్డి అల్లుడు' ‘సవ్యసాచి' ఇలా వరస పరాజయాలతో చైతన్య కనీసం ఇప్పుడు ఒక్క హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అదేవిధంగా అఖిల్ కెరియర్ కూడా నాగార్జునకు తీవ్ర మనోవేదనను గురి చేస్తోంది. అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో రెండవ సినిమా ‘హలో’ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది కూడ ఫెయిల్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి 'Mr. మజ్ను' పై ఉంది. అయితే ఈసినిమా మేకింగ్ లో కూడ సమస్యలు వచ్చాయని బయటకు వార్తలు పొక్కడం నాగ్ కు తీవ్ర టెన్షన్ కలిగిస్తున్నట్లు సమాచారం. మొన్న జరిగిన నాగచైతన్య పుట్టినరోజునాడు నాగార్జున తన పిల్లలు ఇద్దరితో సుదీర్ఘంగా ఆలోచనలు చేసి వారిద్దరిని వారి సినిమాల కెరియర్ విషయంలో అధైర్య పడవద్దని నాగ్ ధైర్యం చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ అక్కినేని యంగ్ హీరో వారసులు ఎప్పుడు ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: