ఈ మద్య సోషల్ మీడియాతో ఎంతో మంది ఔత్సాహికులు తమ టాలెంట్ చూపించుకోవడంతో కోట్ల మంది అభిమానం పొందుతున్నారు.  టాలెంట్ అనేది ఎవడి ఒక్కరి సొంతం కాదని..మరోసారి నిరూపించింది ఓ పళ్లెటూరి మహిళ.  ఒక్క పాటతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు బేబి.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ హాట్ టాపిక్. మట్టిలోని మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనమైన ఆమె పాటకు టాలీవుడ్ ప్రముఖులు ఫిదా అవుతున్నారు.  ఇళ్లలో పని చేస్తూ అడపా దడపా తనకు తోచిన పాటలు పాడుతూ..తన ఇంటివారిని మురిపించే బేబీ ఒకరోజు పాడిన పాట తన పక్కింటి అమ్మాయి రికార్డు చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో ఆమె పాటకు అందరూ ఫిదా అయ్యారు.
Image result for singer baby chiranjeevi home
అప్పటి నుంచి ఆమె పాటలు పలు టివి ఛానల్స్ లో ప్రచారం కావడం..ఇంటర్వ్యూ తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించింది.  చదువు రాని, సంగీతం తెలియని ఆమె శ్రుతి లయలు తప్పకుండా పాడుతుంటే ఆశ్చర్యపోయారు. తొలుత ఆమెను గుర్తించిన టీడీపీ నేత, ఎంపీ మురళీ మోహన్ సన్మానించి, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.  ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంతో మంది ఆమెను కలిశారు..ప్రశంసించారు.  అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ సైతం బేబి పాట విని మెచ్చకున్నారు.

తాజాగా ఈ మట్టిలో మాణిక్యాన్ని పాటను విన్న మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా బీబీకి ప్యాన్‌గా మారిపోయారు. ఆమెను చూడాలని, ఆమె పాటను వినాలన్న కోరికను చిరంజీవి వద్ద వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సహకారంతో ఆదివారం ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు. కోట్లాది మంది అభిమానం పొందిన మెగాస్టార్ చిరంజీవి అంతటి గొప్ప వ్యక్తి తనను ఇంటికి పిలుపించుకోవడం చూసి బేబీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్బంగా కొన్ని పాటలు పాడిన ఆమె చిరూ ఫ్యామిలీని మెస్మరైజ్ చేసింది. తనకు ఈ అవకాశం కల్పించిన కోటికి ధన్యవాదాలు తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: