అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో ప్రతిషాత్మకంగా వచ్చిన సినిమా సవ్యసాచి. డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్త ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి ఆకట్టుకోలేని ప్రయత్నంగా మారిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ కు ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.


శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం చేసిన మూడు సినిమాలు ఒకదానికి మించి మరోటి హిట్ అందుకుంటే మైత్రి మూవీ మేకర్స్ మీడియం బడ్జెట్ తో చేసిన సవ్యసాచి మాత్రం తీవ్ర నిరాశ్ పరచింది. ఈ సినిమా పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది. ఫైనల్ కలక్షన్స్ లో కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేదు.


కార్తికేయతో ప్రతిభ చాటిన చందు మొండేటి ప్రేమం రీమేక్ తో కూడా హిట్ అందుకున్నాడు. అలాంటి డైరక్టర్ ఇలాంటి సినిమా చేస్తాడని ఆడియెన్స్ ఊహించలేదు. సవ్యసాచి నాగ చైతన్య కెరియర్ మీద బాగా దెబ్బ వేసిందని చెప్పొచ్చు. అంతకుముందు వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా నిరాశ పరచినా సవ్యసాచితో పోల్చితే అదే బెటర్ అన్నట్టు ఉంది. అయితే మైత్రి మేకర్స్ కు ఆ తర్వాత వచ్చిన రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా కూడా లాస్ తెచ్చిందని తెలుస్తుంది. 


ఇక ఏరియాల వారిగా సవ్యసాచి క్లోజింగ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 2.60 కోట్లు
సీడెడ్ : 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.16 కోట్లు
ఈస్ట్ : 0.45 కోట్లు
వెస్ట్ : 0.43 కోట్లు
కృష్ణా : 0.67 కోట్లు
గుంటూరు : 0.83 కోట్లు
నెల్లూరు : 0.38 కోట్లు
ఏపి/తెలంగాణ : 7.87 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.85 కోట్లు 
ఓవర్సీస్ : 1.15 కోట్లు
వరల్డ్ వైడ్ : 9.87 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: